Chitram news
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 9:16 pm Editor : Chitram news

ఉదారత చాటిన  ప్రధానోపాధ్యాయుడు మహేందర్ 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నక్కలవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రావుల మహేందర్, పాఠశాలలోని పిల్లందరికి టై, బెల్ట్ ఉచితంగా అందజేసి తన ఉదారతాను చాటుకున్నాడు. పాఠశాలలోని పిల్లలందరికి MEO  మహాముద్ హుస్సేన్ చేతుల మీదుగా టై, బెల్ట్ అందజేశారు.ఈ సందర్బంగా M. E.O మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా వెనకబడిన వారని, వారికి చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి ఉన్నతికి సహాయ పడుతున్న రావుల మహేందర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయడు సంగు స్వామి, PRTUTS మీడియా ఇంచార్జ్ R.రవిరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.