చిత్రం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆదివారం అడప లచ్చన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన సతీమణి గౌరు బాయి జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులున్నారు.
