*వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో “పోలీస్ అక్క” అనే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ (“పోలీస్ అక్క”) ఉంటారు. వీరు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి బాలికలతో మమేకమై గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ఈవ్-టీజింగ్ & సైబర్ వేధింపులు,పోక్సో చట్టం, చట్టపరమైన హక్కులు, సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం, స్వయం రక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 250 మందికి పైగా విద్యార్థినుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షీ టీమ్తో కలిసి జిల్లాలోని అన్ని పాఠశాలలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి బాలిక రక్షించబడినట్లు, సమాచారం పొందినట్లు, సాధికారత పొందినట్లు భావిస్తుంది. పోలీసు వ్యవస్థ విద్యార్థులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

