చిత్రం న్యూస్, ఆదిలాబాద్:రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పథ సంచలనం (రూట్ మార్చ్) నిర్వహించారు. స్థానిక డైట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ పథ సంచలనం వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా తిరిగి డైట్ గ్రౌండ్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎంపీ జి.నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ బలవత్రి గణేష్, విభాగ్ సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతుల కళ్యాణ్ రెడ్డి, ఇందూర్ విభాగ్ కార్యవాహ్ దిగంబర్, ఇతర రాష్ట్రీయ స్వయం సేవకులు, పలువురు పాల్గొన్నారు.
