Chitram news
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 4:33 pm Editor : Chitram news

నేడు జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి కల్యాణోత్సవం , రథోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం నవంబర్ 10వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుండి 16 వరకు వారం రోజుల పాటు జాతర జరగనుంది. ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం, ఇది జైనుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. సంవత్సరానికి  రెండు సార్లు సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఈ ఆలయ ప్రత్యేకత. పక్క రాష్ట్రం మహరాష్ట్రతో పాటు రాష్ట్రంలోని నలుమూలల  నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.