Chitram news
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 5:45 pm Editor : Chitram news

బోర్ వేయించి కాలనీవాసుల  సమస్య తీర్చిన ఆడే గజేందర్

చిత్రం న్యూస్, బోథ్:  బోథ్ మండలం పొచ్చర గ్రామంలో రాంనగర్ కాలనీవాసులు నీటి సమస్య ఉందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోర్ వేయించి వారి నీటి సమస్యను తీఇచ్చారు. దీంతో కాలనీవాసులు ఆడే గజేందర్ ను శాలువాతో సన్మానించారు. కాలనీ వాసులతో కలిసి నూతన బోర్ ను బటన్ వేసి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే, సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు వారి వెంట నాయకులు ,కార్యకర్తలు, ఉన్నారు.