Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు

గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం

చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో  మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో  రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా  మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకోవడంతో గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో  మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments