Chitram news
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 5:44 pm Editor : Chitram news

అఖిల్ రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి బావ మరిది అఖిల్ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి వెళ్లి అఖిల్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పుష్పాంజలి ఘటించారు.  ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోక ప్రవీణ్ రెడ్డితో  పాటు సయ్యద్ ఇమ్రాన్, గడ్డం శ్రీకాంత్ రెడ్డి, రాం రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.