*రోడ్డుపైనే వంట వార్పు
*అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతులు
చిత్రం న్యూస్, సొనాల:కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ సొనాల మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాను నిర్వహించారు. వంట వార్పు చేసి అక్కడే భోజనం తిన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా, మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందన్నారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సొనాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పంటలను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేవారని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని, రైతులకు రావలసిన రైతుబంధు విడుదల చేయాలని, పత్తి పంటను పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని అన్నారు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సీఐ గురుస్వామి, ఏవో అక్కడకు చేరుకొని సముదాయించారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముత్తన్న, జనార్ధన్ ,ఇర్ల అభిలాష్, భీంరావు పాటిల్, యాల్ల సుధీర్ రెడ్డి, హరీష్, లంక లలిత, రామ్ కిషన్, వినోద్, సంజీవరెడ్డి, సుగుణాకర్ తుల, అభిలాష్, రాజన్న, ప్రదీప్, కృష్ణ, ఈశ్వర్, సంతోష్ ఇర్ల శ్రీధర్, నవీన్, శ్రీకాంత్, విట్టల్, మహేష్, ఆసిఫ్ షేక్, శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.
