Chitram news
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 5:19 pm Editor : Chitram news

ఏకగ్రీవంగా సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు

చిత్రం న్యూస్, భీంపూర్: సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భీంపూర్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహకార కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్  ఎ.నవీన్ కుమార్ ను నియమించారు. భీంపూర్ లోని సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించగా సొసైటీలో (09) డైరెక్టర్ పోస్టు లకు ( 09) మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా మెస్రం దీపీక, సహ అధ్యక్షులుగా మెస్రం నాగమ్మ, కార్యదర్శిగా ఆత్రం సరస్వతి, కార్య నిర్వాహక సభ్యులుగా కుడుమెత సంగీత, గేడం పుష్పలత, కినక మమత, గేడం రూప, పెందుర్ మనీషా, తొడసం శశికళ బాయిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘ బలోపేతానికి పనిచేయాలని కోరారు. ఎన్నికైన సభ్యుల కాల పరిమితి (05) సంవత్సరాల వరకు ఉంటుంది. ఎన్నికైన సభ్యులకు ఎన్నికల అధికారి ఎ.నవీన్ కుమార్ ధృవీకరణ పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆదర్శ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.