వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా
*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు
*తప్పిన పెను ప్రమాదం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

