Chitram news
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 10:17 pm Editor : Chitram news

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

చిత్రం న్యూస్, బోథ్: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నిర్వహించారు. బోథ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీసాయి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మండలం లోని యువకులు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రక్తదానం చేశారు. రక్తదానం చేయడంతో ఒక ప్రాణం నిలబడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.