దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల నాటి ఆచారం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
*ఆదివాసీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల నుండి వస్తున్న ఆచారం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మావల మండలం పరిధిలోని కుమురం భీం కాలనీలో సోమవారం జరిగిన దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేయగా కిషన్ రెడ్డి ఆదివాసీలకు దీపావళి, దండారీ ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఎమ్మెల్యే గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తనకు సమయం దొరికినప్పుడల్ల ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. కుమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, బీజేపీ నాయకులు ముకుంద్ రావు, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

