Chitram news
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 10:46 am Editor : Chitram news

దండారీ ఉత్సవాల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీల ప్రధాన పండగ అయిన దండారి ఉత్సవాలు ఏజెన్సీ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వట్ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేల్ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.