Chitram news
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 7:02 am Editor : Chitram news

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రమణాచార్యులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయ ప్రాశస్త్యాన్ని  వివరించారు.  కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.