Chitram news
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 9:38 am Editor : Chitram news

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి 

*స్వాగతం పలికిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

*ఆలయ పునర్నిర్మాణాన్ని మ్యాప్ ద్వారా వివరించిన ఎమ్మెల్యే

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ స్వామికి స్వాగతం పలికి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మణాన్ని ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా స్వామికి వివరించారు. పవిత్ర పుణ్య క్షేత్రం బాసర ను సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ సూచనలు సలహాలు తమకు ఎంతో అవసరమని స్వామీజీకి తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతిగా అమ్మవారి చెంతకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వ్యాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం సరస్వతి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు దర్శనం ఇవ్వడం ఇది ఎంతో పుణ్య భూమి అని విధుశేఖర భారతి స్వామి అన్నారు.