ఆబ్కారీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేత
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ గ్రామంలో ఉన్న రెండు మద్యం షాపులతో పరిసరాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆబ్కారీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు .చుట్టూ ఉన్న నివాస గృహాలకు. మహిళలకు, స్కూల్ పిల్లలకు, హాస్పిటల్ రోగులకు, బాలికల హాస్టల్ విద్యార్థులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆటంకం కలుగుతుండడంతో కొత్తగా ఏర్పడ బోయే మద్యం షాపులను వీటికి దూరంగా ఏర్పాటు చేయాలని బోథ్ గ్రామస్తులు కోరారు.
