సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అడవి పందుల రక్షణ కోసం అమర్చిన సోలార్ వైరుకు తగిలి గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చేసినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. వయస్సు దాదాపు 50 ఉన్నట్లుగా గుర్తించామన్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికిలోని మార్చురీ గదికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712659947 నంబర్ ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
-Advertisement-

