రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామానికి చెందిన టేకం పోతుబాయి అనే మహిళను మంగళవారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రుపేష్ రెడ్డి ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఈ సందర్భంగా టేకం పోతుబాయి పరిస్థితిని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత వైద్యులకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టేకం పోతుబాయి పరిస్థితిని కుటుంబ సభ్యులు ముందుగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.దీంతో వారి కుటుంబ సభ్యులను కలిసి టేకం పోతుబాయిని ఆసుపత్రికి తరలించడంతో కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
