ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆలయ అర్చకుల వైదిక బృందం ఘన సన్మానం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నూతన బాసర మండల ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గానికి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకుల వైదిక బృందం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పాదాల వద్ద పూజలు నిర్వహించారు. ఆలయ AEO సుదర్శన్ గౌడ్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్, వేద పండితులు నవీన్ శర్మ ఉన్నారు. అనంతరం రవీంద్ర పూర్ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తించి పదోన్నతి పొంది బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న మమ్మయి శ్రీనివాస్ ను బాసర టియుడబ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం తరఫున సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలను అందజేశారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


