Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

 బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్ బేల: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో గల నూతన బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల బీఆర్ఎస్ నాయకులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సదల్పూర్ లో ఉన్నటువంటి బైరందేవ్, మహాదేవ్ దేవాలయ ఆవరణలో రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటు పాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజ్రావు , అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మాజీ సర్పంచులు విపిన్ ఖోడే, విట్టల్ వరాడే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప, ముఖ్యనాయకులు విట్టల్ రౌత్ ,బత్తుల సుదర్శన్, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments