పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో పురుగుమందు తాగి యువకుడు (20) ఆత్మహత్య చేసుకున్నట్లు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..వడూర్ గ్రామానికి చెందిన కడారి వినోద్ ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నాడు. గమనించిన కుటుంబీకులు బోథ్ ఆసుపత్రికి తరలించారన్నారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


