Chitram news
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 2:11 pm Editor : Chitram news

బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం నుండి అయ్యప్ప సన్నిధికి వెళ్లే భక్తుల పాదయాత్ర ను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర లో 40 మంది అయ్యప్ప మాలదారులు పాల్గొంటున్నారు. యాత్రలో రాష్ట్రాల సరిహద్దుల వద్ద అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ స్వాగతం పలికి ఏర్పాట్లు చేస్తుందన్నారు. అయ్యప్ప సన్నిధిలో అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ స్వాగతం పలుకుతారన్నారు. పాద యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని సరస్వతి అమ్మవారిని మొక్కుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /