బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ ల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. కాగా ప్రెస్ క్లబ్ మండల గౌరవ అధ్యక్షులుగా ఎండల సంతోష్ రావు, జిల్లా అధ్యక్షులుగా నర్సూరి భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా అబ్బువార్ గౌతం, కోశాధికారిగా బండారి ఆనంద్, సలహాదారులుగా హనుమంతరావు, నర్సూరి ధర్మారావు లను ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులుగా పింప్లే రామేశ్వర్ .బలగం రాములు, సుధాకర్ రావు, దావు సంతోష్, జాదవ్ సంజీవ్, జాజోళ్ల ప్రకాష్, పసుపుల నాగేష్, బలగం పవన్ కుమార్ లను ఎన్నుకున్నారు. అనంతరం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ లు మాట్లాడుతూ..ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురితం చేయాలని సూచించారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకొన్నారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు
