ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి నుంచి బెదోడ వరకు మంజూరైన రహదారి పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెదోడ నుంచి 35 మంది విద్యార్థులు సాంగిడి ఉన్నత పాఠశాలకు చదువుకునేందుకు నిత్యం ఆటోలో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పోషకులు స్వయంగా రహదారి బాగు చేయడంతో ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి బుధవారం ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కలిసి అసంపూర్తిగా ఉన్న రోడ్డుని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సామ రూపేష్ రెడ్డి కోరడంతో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభించి చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట సంతోష్, సుధాకర్, మంచికంటి సాయి, గెడం సతీష్ తదితరులు ఉన్నారు.

