సోనేరావును సన్మానించిన కలెక్టర్, ఎస్పీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కుమురం భీం వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమురం భీం విగ్రహానికి ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భీం ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఇటీవల ఆదిమ గిరిజన కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన కొడప సోనేరావును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సన్మానించారు. అభినందనలు తెలిపారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


