బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం
* ఏ కాలనీలో చూసిన పిచ్చికుక్కల దాడి బాధితులే..
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన బాలుడు అలీ అబ్దుల్లా నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఓ వీధి కుక్క దాడి చేయడంతో ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడికి వైద్యులు చికిత్స చేశారు. కాలనీలలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్ దుకాణాల వద్ద వీటి బెడద అధికంగా ఉంటుందని, క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చిన్నారులు వృద్ధులు, బిక్కుబిక్కుమంటుంన్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
