Chitram news
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 1:49 pm Editor : Chitram news

బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ

బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ప ఆదిలాబాద్  ఎంపీ గోడం నగేష్ శనివారం పరామర్శించారు. వడూరు గ్రామంలోని ఉప్పు పోశెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  తేజపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు.తేజపూర్ గ్రామంలోని రెండు రోజుల క్రితం సోలార్ ఫెన్సింగ్ కారణంగా మరణించిన ఏలేటి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు.  ఎంపీ వెంట సీనియర్ నాయకులు గాదె శంకర్, మండల ఉపాధ్యక్షులు సురేష్, సీనియర్ నాయకులు కొప్పుల గంగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ ధ్రువరాజు, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బోథ్ మండల ఆధ్యక్షులు బోరే రవీందర్, సీనియర్ నాయకులు చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.