Chitram news
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 1:25 pm Editor : Chitram news

విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత

విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత

 భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపనకు, మహా అన్నదాన కార్యక్రమానికి రూ.10,100. నగదు అందజేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో శాతవాహనుల కాలంలో నిర్మించిన భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన  ఈ నెల 12న నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహాయంగా అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్  రూ.5,100 నగదును,  మహా  అన్నదాన కార్యక్రమానికి మరో రూ.5 వేలు శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సతీష్ పవార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయంగా నగదు అందజేసిన సతీష్ పవార్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొరంగే శ్యాంరావు, ఉప అధ్యక్షులు మెస్రం వాసుదేవ్, జనరల్ సెక్రటరీ సిడం ఖుశాల్, భీంరావుకొడప, సంజయ్ నిపుంగే, మరాఠా తిరిలే కున్భీ సమాజ్ అధ్యక్షులు విఠల్ రౌత్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.