ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ మాట్లాడుతూ..గాంధీ ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. గాంధీజీ భారత దేశ స్వతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు అని అహింసా సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఉప్పు సత్యగ్రహం దీక్ష చేశారన్నారు. అహింస పరమో ధర్మ అని ఆయన పుట్టిన రోజున ఏ జీవిని హింసించకుండా మద్యం, మాంసం దుకాణాలు అందుకే బంద్ నిర్వహించాలని ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ బిక్క గంగాధర్, వైస్ చైర్మన్ జడల భోజన్న, క్యాషియర్ బూతి తులసీదాస్, రైటర్ దూర్కి రాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, మాజీ సర్పంచ్ రాజు యాదవ్, వీడీసీ సభ్యులు విఎన్ రాజేశ్వర్, డి.బ్రహ్మం గౌడ్, ఎరేకర్ రాజేశ్వర్, మండల్ నవీన్, కొత్తపెల్లి భూమన్న, జి.రాకేష్, గజ్జల గంగయ్య, తెడ్డోజీ శంకర్, సి.నీలేష్, బండారి శ్రీనివాస్, మండల ప్రవీణ్, భీమ లింగు, వొర్స రవీందర్, రామేల్లి చిన్నయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
