కారు బోల్తా.పలువురికి గాయాలు
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కారు డివైడర్ కు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని గమనించి తక్షణమే అంబులెన్స్ కి సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


