కారు బోల్తా.పలువురికి గాయాలు
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కారు డివైడర్ కు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని గమనించి తక్షణమే అంబులెన్స్ కి సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
