రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
చిత్రం న్యూస్, జైనథ్: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల Stage -2 రిటర్నింగ్ అధికారులు, stage-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జైనథ్ మండల కేంద్రములోని రైతు వేదికలో సోమవారం శిక్షణ తరగతులు చేపట్టారు. ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఉపసర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనే అంశాలపై రిసోర్స్ పర్సన్లు పసుల ప్రతాప్, శ్రీహరి బాబు, జైనథ్ MPDO మహేష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేల Mpdo శ్రీనివాస్, భోరజ్ MPDO వేణు, సాత్నాల MPDO రాజు, నాలుగు మండలాల ఉద్యోగులు పాల్గొన్నారు.
