గ్రూప్-1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికైన కరెండే మహేందర్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన SI కరెండే మహేందర్ ఇటీవల విడుదల అయిన గ్రూప్ – 1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. సోమవారం భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పాటిల్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డ, బాసర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగం రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి, యువ నాయకుడు పురంశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
