Chitram news
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 8:14 am Editor : Chitram news

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

చిత్రం న్యూస్, విజయవాడ: మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ స్లాట్ సమయంలో సతీ సమేతంగా వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు.  శాలువా కప్పి సన్మానం చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.