Chitram news
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 4:03 am Editor : Chitram news

స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం

స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు స్కంద మాత రూపంలో శుక్రవారం  భక్తులకు దర్శనమిచ్చారు.  అమ్మవారిని వేద పండితులు వేద మంత్రోచ్ఛారణాలతో, ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. వైదిక బృందం వేకువ జామున చతుషష్టి ఉపచార పూజలు, మహా హారతి ఇచ్చారు. అనంతరం పెరుగు అన్నంను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వేకువ జాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి వరుసలో బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకొని  మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.