Chitram news
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 12:59 pm Editor : Chitram news

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా బుధవారం ఆయనను కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై  ఆయన ఆరా తీయగా సామ రూపేష్ రెడ్డి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారని ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని రూపేష్ రెడ్డి తెలిపారు.