బ్రహ్మచారిణీ అవతారంలో బాసర అమ్మవారు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడి చేతిలో జప మాల,ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. అమ్మ నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుందని భక్తుల ప్రతీతి. ఆలయ వేద పండితులు అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజ నిర్వహించి నైవేద్యంగా పులిహోరను సమర్పించారు. ఆలయ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గోదావరి నది ఒడ్డున నదిలో భక్తులను లోపలికి వెళ్ళకుండా బారికేడ్ ను ఏర్పాటు చేశారు

