Chitram news
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 8:40 am Editor : Chitram news

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

*గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కిసాన్ మోర్చా మండల కార్యదర్శి ఉయిక గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గస్కంటి సంజీవ్, బీజేపీ నాయకులు చెట్పల్లి సంతోష్, రవి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా  మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం చెట్పల్లి వెంకటేష్ మాట్లాడుతూ..రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని అనిల్ జాదవ్ నాయకత్వంలొనే బోథ్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ విజయడంఖా మోగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త కంకణం కట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, దేవేందర్ రెడ్డి, నాయకులు సాబ్లే సంతోష్ రాథోడ్ రాజశేఖర్, రాథోడ్ సురేందర్, గులాబ్, లక్ష్మణ్, గణేష్ నాయక్, మాజీ సర్పంచ్ మురళి, గోపి, వెంకటరమణ, చవాన్ రాంకుమార్ తదితరులు ఉన్నారు.