కుమారిలో కొలువు తీరిన దుర్గమ్మ
*విగ్రహ దాత వోర్స రాజు యాదవ్_ప్రవళిక దంపతులకు గ్రామస్తుల సన్మానం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో ఆడపడుచులు, పెద్దలు, చిన్న తేడా లేకుండా భాజా భజంత్రీలతో డప్పుల చప్పుళ్లతో మంగళహారతులతో దుర్గామాతకు స్వాగతం పలికారు. ఊరిలోని ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఊరేగింపులో పాల్గొని నియమనిష్టలతో దుర్గాదేవిని ప్రతిష్టాపన చేశారు. విగ్రహ దాత వొర్స రాజు యాదవ్, ప్రవళిక దంపతులను గ్రామస్తులు శాలువాతో సన్మానం చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

