విజ్ఞాన్ స్కూల్ లో ఘనంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
*ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ స్కూల్ ఫర్ డిస్సబ్లెడ్ చైల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఆదిలాబాద్ అర్బన్ ఛైర్మన్ గోపిడి సవీన్ రెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, హేమంత్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
