బోథ్ లో ముస్తాబవుతున్న దుర్గ మండపం
*శ్రీమాత ఈవెంట్స్ ఆధ్వర్యం లో అద్భుత సెట్టింగ్
*ప్రతి యేటా వినూత్న అలంకరణతో ఆకట్టుకుంటున్న మండపం
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోని దుర్గ మండపం నవరాత్రులకు అందంగా ముస్తాబు అయింది. ప్రతి సారి వినూత్నంగా (కొత్తగా) సెట్టింగ్ తో ముందుకు వచ్చే దుర్గ మండపం ఈ సారి శ్రీ మాత ఈవెంట్స్ ఆధ్వర్యంలో కలకత్తా మాత సెట్టింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. అయితే సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయని, సోమవారం ఉదయం 11 గంటలకు దేవి శోభాయాత్ర మొదలు అవుతుందని దుర్గ కమిటీ అధ్యక్షుడు పాలిక్ రమేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సెట్టింగ్ అందిస్తున్న శ్రీ మాత ఈవెంట్స్ కి దుర్గ కమిటీకి తరుపున ధన్యవాదాలు తెలిపారు.
