Chitram news
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 2:16 pm Editor : Chitram news

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ముఖ్య అతిథిగా ముథోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీపీ చైర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్‌ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.47లక్షలు ఖరీదుచేసే ఉపకరణాలను దివ్యాంగులకు  అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదు..ఇది సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగన్నారు. ఈ పరికరాలు చైతన్యం,  ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ రోజు లబ్ధిదారుల ముఖాల పై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.