గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
* పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిడిగొండ మండలం బుగ్గరం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ప్రిన్సిపల్ సన్మానించారు. అనంతరం విద్యార్థినిలు చేసిన నృత్యాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకుందామని విద్యార్థులకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అనిల్ అన్న 24 గంటలు అందుబాటులో ఉంటాడని ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రాథోడ్ సురేందర్, నేరడిగొండ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
