విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి
చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ లో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారితో కలిసి సందర్శించారు. పాఠశాల చుట్టూ ఉన్న అపరిశుభ్రతను వెంటనే బాగుచేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాలలో వంట గది, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రత్యేక అధికారి గెడం నవీనను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

