జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛ భారత్
చిత్రం న్యూస్, జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకులు గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్కం రాందాస్, నాయకులు గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి, దంతెల రవీందర్, రామన్న, ఉషన్న, సూర్య రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

