Chitram news
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 2:46 pm Editor : Chitram news

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ: బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి  నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం రూ.5.21కోట్ల నిధులు, గుడిహత్నూర్ మండలం డోంగ్రగావ్ నుండి మన్నూర్ మీదుగా కొల్హారి, శాంతపూర్  వరకు బీటీ కోసం రూ.4.40 కోట్ల నిధులు మంజూరు చేశానని,  ప్రజల చిరకాల వాంఛ రోడ్డు సమస్య అని,  ప్రజా సమస్యలే పరమావధిగా కొనసాగుతానని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు.