Chitram news
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 3:50 pm Editor : Chitram news

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం ఘన్ పూర్ చెక్ పోస్ట్ వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు.  ఎస్ఐ శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రవ్వజియ, డ్రైవర్ జావీద్ నాగపూర్ లో 33 ఎడ్లను కొనుగోలుచేసి శంషాబాద్ లోని కబేళానికి ఒక లారీ లో తరలిస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘన్ పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లారీని పట్టుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తర్వాత 33 ఎడ్లను ఇచ్చోడ లోని  గోశాలకు తరలించినట్లు ఎస్ఐ శ్రీసాయి పేర్కొన్నారు.