పీసీసీ చీఫ్ సమక్షంలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో మంగళ వారం మాజీ టిపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డిలు సొంత గూటికి చేరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.


