Chitram news
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 3:47 pm Editor : Chitram news

ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం

చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి గాను భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలోని వైష్ణవి విద్యానికేత్ పాఠశాల కరెస్పాండెంట్ సాయినాథ్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్,  ఉపాధ్యాయులు,  చింతలబోరి గ్రామస్తులు అభినందించారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుభాష్, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వడేకర్ లక్ష్మణ్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్, పీఆర్టీయూ నాయకులు రమణారావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాచేవాడ్ గంగా ప్రసాద్, లయన్స్ క్లబ్ మోహన్ రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.