భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
చిత్రం న్యూస్, జైనథ్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జైనథ్ మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జైనథ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..భారీ వర్షానికి వరదలతో రైతులు సోయా,పత్తి పంటలు నష్టపోయి దాదాపుగా నెల రోజుల అయిన ఇంత వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని, ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్య రెడ్డి, అశోక్, సిడం రాకేష్, పోచ్చన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

